నేడు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లతో అసెంబ్లీ వద్ద రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నదని కేటీఆర్ వీఆర్ఏ నేతలతో తెలిపారు. వీఆర్ఏల డిమాండ్ల పైన ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉన్నదన్నారు. ప్రస్తుతం తెలంగాణలో జాతీయ సమైక్యత వజ్రోత్సవ సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో వీఆర్ఏలు తమ ఆందోళనలను విరమించి, విధుల్లో చేరాలన్నారు. 17న జాతీయ సమైక్యత వజ్రోతవ సంబరాలు ముగిసిన అనంతరం 18 తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీఆర్ఏ ప్రతినిధులతో చర్చలు నిర్వహిస్తారని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ తమను పిలిచి తమ వాదనలు వినడం పట్ల వీఆర్ఏల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.