mt_logo

యూనివర్సిటీల్లో త్వరలో 1,448 పోస్టుల భర్తీ!

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకోసం యూనివర్సిటీల్లో ఉన్న ఖాళీలను సేకరించే పనిలో పడింది. రాష్ట్రంలోని 10 యూనివర్సిటీల్లో 1,261 మంది కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. వివిధ వర్సిటీల్లో ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టులు మొత్తం 2,718 ఉండగా, వాటిలో కేవలం 795 పోస్టులు భర్తీ చేశారు. మిగిలిన 1,448 అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయాలని ఈనెల 26న జరిగిన సమీక్షాసమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పోస్టులను దశలవారీగా భర్తీ చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధికారులకు సూచించారు. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీలోనే 616 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో 480 పోస్టుల్లో అధ్యాపకులు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వం మంజూరు చేసిన వాటికంటే అదనంగా కాంట్రాక్ట్ అధ్యాపకులను నియమించడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *