mt_logo

రాజకీయాలు తప్ప రైతు గోస పట్టడంలేదు- హరీష్ రావు

వర్షాకాల శాసనసభ సమావేశాలు మూడవరోజు ప్రారంభం అయ్యాయి. ఉభయసభల్లో రైతు సమస్యలపై రెండవ రోజు చర్చ కొనసాగుతుంది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రైతు సమస్యలపై విపక్షాలు సహకరించాలని, వేరే అంశాలను చర్చలోకి తీసుకురావొద్దని, మిగతా అంశాలను తర్వాత మాట్లాడుకుందామని సూచించారు. నిన్న జరిగిన సభలో విపక్షాలు ఇచ్చిన సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని, రైతులకు భరోసా ఇచ్చేలా సభలో చర్చ కొనసాగిద్దామని చెప్పారు.

అన్ని అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉందని, విపక్షాలకు రాజకీయాలు తప్ప రైతు గోస పట్టడంలేదని, రైతులపై నిజమైన ప్రేమ ఉంటే చర్చకు సహకరించాలని హరీష్ పేర్కొన్నారు. రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే వారిని తెలంగాణ రైతాంగం గమనిస్తుందని, రైతుల పట్ల ప్రతిపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని హరీష్ రావు మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *