mt_logo

సోనియాగాంధీ వల్లే తెలంగాణ- టీ జేఏసీ

ఆరు దశాబ్దాల పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని, తెలంగాణ ప్రజల కోరిక ఇన్నాళ్ళకు తీరిందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆనందం వ్యక్తం చేశారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణ ప్రజలందరి తరపున ఆమెకు కృతజ్ఞతలు అందచేసామని కోదండరాం అన్నారు. శుక్రవారం తెలంగాణ జేఏసీ నాయకులు ప్రొ. కోదండరాం అధ్యక్షతన సోనియాగాంధీని ఆమె నివాసంలో కలిసి తెలంగాణ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తర్వాత మీడియాతో కోదండరాం మాట్లాడుతూ ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసుందాం అనే నినాదంతో జేఏసీ ఉద్యమాలు చేసిందని సోనియాకు వివరించామన్నారు. సీమాంధ్ర ప్రజల మీద తమకు ఏ ద్వేషం లేదని, తెలంగాణలో పెత్తందార్లుగా వ్యవహరిస్తున్న కొద్దిమంది పెట్టుబడిదార్లకు మాత్రమే తాము వ్యతిరేకమని ఆమెకు వివరించామన్నారు. తమ నినాదంలోని ఔన్నత్యాన్ని తెలుసుకుని సోనియా ఆనందం, ఆశ్చర్యం వ్యక్తం చేశారని చెప్పారు. తెలంగాణ జేఏసీ నాయకులు 22 న ఢిల్లీనుండి బయలుదేరి హైదరాబాద్ కు మధ్యాహ్నం 12 గంటలకు చేరుకోనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుండి గన్ పార్క్ వరకు ర్యాలీగా చేరుకొని అమరవీరులకు నివాళులర్పించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *