mt_logo

తెలంగాణ సమగ్ర చిత్రపటం ఆవిష్కరించిన బోయినపల్లి వినోద్ కుమార్

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 33 జిల్లాల సమగ్రమైన అట్లాస్ మ్యాప్‌ను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆవిష్కరించారు. సోమవారం మంత్రుల నివాసంలో విష్ణు మ్యాప్ పబ్లికేషన్స్ సంస్థ ముద్రించిన ఈ మ్యాపును ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ… రాష్ట్రానికి చెందిన పూర్తి భౌగోళిక అంశాలను సూచించే సమగ్ర పటం ఇది అన్నారు. కేంద్ర ప్రభుత్వ సర్వే ఆఫ్ ఇండియా శాఖ ఆమోదించిన తాజా సమాచారంతో రాష్ట్రంలోని 33 జిల్లాలు ఉన్న పటం ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు, అధికార యంత్రాంగానికి, విద్యార్థులకు ఈ మ్యాప్ ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *