శనివారం చెన్నైలో సమావేశమైన దక్షిణ భారత రైతు సమితి నాయకులు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలు అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు సచివాలయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తో సమావేశమై తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, రైతుభీమా, వ్యవసాయ రంగంకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా తమిళనాడులో కూడా అమలుపరచాలని వినతి పత్రాన్ని సీఎం స్టాలిన్ కు అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ పథకాలు అద్బుతంగా ఉన్నాయని, వాటిని తమిళనాడులో అమలు చేసేందుకు పరిశీలిస్తాం అని హామీ సీఎం స్టాలిన్ ఇచ్చారు. జాతీయ రైతు సంఘం ఉపాధ్యక్షుడు, పసుపు బోర్డ్ సాధన సమితి అధ్యక్షుడు నరసింహనాయుడు మాట్లాడుతూ… వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం అబలంబిస్తున్న తీరు అద్భుతమని కొనియాడారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు రైతు బంధు, రైతు భీమా వంటి కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. వానాకాలంలో 7000 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు వరిధాన్యంన కొనుగోలు చేయడం అంటే ఆషామాషీ కాదని, ఎమ్మెస్పీ విషయంలో కేంద్రానికి లేఖ రాసి మరోమారు రైతుల పట్ల తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఉన్న చిత్తశుద్ధి చాటుకున్నారని అభినందించారు. అన్ని రాష్ట్రాలు ఎమ్మెస్పీ పై కేంద్ర ప్రభుత్వం ను నిలదీయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. కేరళకు చెందిన రాష్ట్రీయ కిసాన్ మహా సంఘ్ కో ఆర్డినేటర్ పిటి జాన్ మాట్లాడుతూ… రైతుబంధు, రైతుభీమా వంటి పథకాలు రైతులకు ఎంతో ఉపయోగమని, తెలంగాణ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు దేశానికి రోల్ మోడల్ అని హర్షం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటక సంయుక్త కిసాన్ మోర్చా అధ్యక్షుడు శాంతా కుమార్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రైతు పథకాలు అద్బుతమని అన్నారు. రైతులకు మేలు చేసేలా రైతు సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయని… రైతుల, వ్యవసాయ రంగంపై వివక్ష పట్ల కేంద్ర ప్రభుత్వాన్ని నిలదిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయడం అభినందనీయమన్నారు. ఎమ్మెస్పీ, ఇతర రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు రైతులకు ఎంతో మేలు చేసేలా ఉన్నాయని కొనియాడారు.
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- Bhu Bharathi: Mandatory survey for land sales causes several hardships
- రేవంత్ సర్కార్ తొలగించిన తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక ఇదే!
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!