mt_logo

ఐటీ మంత్రి కేటీఆర్ తో టాటా గ్రూప్ ప్రతినిధుల భేటీ..

ఐటీ శాఖామంత్రి కేటీఆర్ తో ఈరోజు టాటా గ్రూప్ కంపెనీల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణలో ఏర్పాటు చేయబోయే 200 మెగావాట్ల సోలార్ ఉత్పత్తి కేంద్రంపై చర్చలు జరిపారు. తెలంగాణకు అంతర్జాతీయ సంస్థల రేటింగ్ పొందే కార్యక్రమానికి టాటా గ్రూప్ సహకారం అందిస్తామని చెప్పింది. పెట్టుబడుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై టాటా గ్రూప్ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *