mt_logo

సీఎం కేసీఆర్ ఓఎస్డీగా ప్రవీణ్ కుమార్..

రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సెక్యూరిటీ ఓఎస్డీగా డీఎస్పీ ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి డీజీపీ అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన ప్రవీణ్ కుమార్ ను వెంటనే రిలీవ్ చేయాలని ఆదిలాబాద్ ఎస్పీ తరుణ్ జోషీని డీజీపీ ఆదేశించారు. 2010 గ్రూప్ 1 బ్యాచ్ కు చెందిన ప్రవీణ్ కుమార్ 2014 మార్చి 1న ఆదిలాబాద్ ఓఎస్డీగా బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయన కడప జిల్లా మైదుకూరులో డీఎస్పీగా నియమించబడ్డారు. ఆతర్వాత రెండునెలల పాటు హైదరాబాద్ గ్రేహౌండ్స్ లో పనిచేసిన ప్రవీణ్ కుమార్ ఆదిలాబాద్ ఓఎస్డీగా ట్రాన్స్ ఫర్ అయ్యి వచ్చారు. ఈయన స్వస్థలం వరంగల్ జిల్లా కొత్తగూడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *