mt_logo

ఒమిక్రాన్ నేపథ్యంలో రద్దైన సండే – ఫండే ఫెస్టివల్

కరోనా ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్ వద్ద, చార్మినార్ వద్ద అట్టహాసంగా నిర్వహిస్తున్న సండే – ఫండే కార్యక్రమాన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ అర్బన్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ప్రకటన జారీ చేశారు. డిసెంబర్ 5 ఆదివారం నిర్వహించే సండే – ఫండే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు, ఆ పరిసర ప్రాంతాలల్లో వాహనాలను యధావిధిగా అనుమతిస్తున్నటు పేర్కొన్నారు. కాగా ఒమిక్రాన్ నేపథ్యంలో ఇప్పటికే నిఘా విధించగా.. ఇక రద్దీ ప్రాంతాలపై దృష్టి సారిస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *