mt_logo

లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి: కేటీఆర్

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈరోజు కాంగ్రెస్‌కు బీజేపీని అపే దమ్ము లేదు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి విచిత్రంగా ఉంది, ఇక్కడున్నది బీజేపీ అన్నట్లు ఉంది అని అన్నారు.

అక్కడ రాహుల్ గాందీ చౌకిదార్ చోర్ అంటే, రేవంత్ మాత్రం బడే భాయ్ బాగుండు అంటుండు. అక్కడ అదానీ మంచోడు కాదు అంటే రేవంత్ రెడ్డి మాత్రం మంచోడు అంటాడు. అక్కడ రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ దుర్మార్గం అంటే ఇక్కడ మా బడే భాయ్ మోడల్ బాగుందని రేవంత్ అంటుండు అని పేర్కొన్నారు.

ఇక్కడ రేవంత్ రెడ్డి బీజేపీ పాట పాడుతుండు.. పార్లమెంట్ ఎన్నికల తర్వతా బీజేపీలో చేరే మెదటి వ్యక్తి రేవంత్ రెడ్డినే.. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో 40 సీట్లు దాటదు. ఎన్నిసార్లు ఆయన ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్తారని విమర్శలు చేసినా.. అనవసరమైన వాటి పైన అడ్డగోలుగా మాట్లాడే రేవంత్ రెడ్డి వాటి పైన స్పందించలేదు అని తెలిపారు. 

నా జీవితమంతా కాంగ్రెస్‌లో ఉంటా అని ఏనాడు రేవంత్ చెప్పలేడు. ఎందుకంటే ఎన్నికల తర్వాత తన మనుషులతో బీజేపీలో చేరుతారు. ఒకవైపు ఇసుక దందా, రైస్ మిల్లర్ల పైన బ్లాక్ మెయిల్ చేస్తున్నారు,  బిల్డర్లను బెదిరించడం, రియల్టర్లను బెదిరించడం లాంటి వార్తలన్ని బయటకు రాకుండా స్కామ్‌ల పేరు చెప్పి, ఈ వార్తలనే టీవీలలో తిప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు అని కేటీఆర్ విమర్శించారు.

మున్సిపల్ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మూడు నెలలుగా ఎందుకు బిల్డింగ్‌లకు అనుమతులు ఇవ్వడం లేదు.. డబ్బులు ఇస్తేనే అనుమతులు ఇస్తామని ఢిల్లీకి రూ. 2,500 కోట్ల రూపాయలు పంపింది నిజం కాదా అని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లెక్క మాట్లాడటం లేదు, రేవంత్ రెడ్డి జేబులో కత్తెర పెట్టుకొని జేబుదొంగ లెక్క తిరుగుతున్నాడు.. పేగులు మేడలేసుకుంటున్న అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. ఇలాంటోడు మన ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని దుయ్యబట్టారు.

కరెంటు ఇయ్యడానికి, రైతుబంధు ఇయ్యడానికి, మహిళామణులకు రూ. 2,500 ఇయ్యడానికి, రూ. 4,000 పెన్షన్లు ఇయ్యడానికి చేతకాదు కానీ ఇవన్నీ కవర్ చేయడం కోసం ఫోన్ ట్యాపింగ్, స్కాముల అంటూ వార్తలు రాపిచ్చుకుంటున్నాడు. నీ చేతులలో అధికారం ఉంది కదా ఏం చేస్తావో చెయ్… ఎవరెవరు, తప్పులు చేసినా వాళ్ళ పైన చర్యలు తీసుకో అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.

రేవంత్ రెడ్డికి భయపడే వారేవు లేరు, ఆయన వెంట్రుక కూడా పీకలేడు.. ఆయనకు ముఖ్యమంత్రిగా అసలు పని చేసే తెలివి లేదు అని అన్నారు.

రాజకీయాల్లో సికింద్రాబాద్ అంటేనే గుర్తుకొచ్చే పేరు పద్మారావు గారి పేరు. 24 ఏండ్ల నుంచి పార్టీకి నగరంలో అండగా ఉన్నారు. పద్మారావు గారు పోటీ చేస్తున్నారనగానే పార్టీ గెలుస్తుందని అందరు చెబుతున్నారు. కష్టకాలంలో అండగా ఉన్నవాళ్లే నాయకులు అని పేర్కొన్నారు.

దానం నాగేందర్ పార్టీ వదిలిపోయారు, రాజకీయాల్లో హత్యలుండవు, అత్మహత్యలు ఉంటాయి. అయన నిర్ణయం తప్పు అని ఎన్నికల్లో గెలిచి మనం చూపించాలి.. ఆయన అధికారం కోసం ఆశపడి, గెలిపించిన ప్రజలకు ద్రోహం చేసి వెళ్ళాడు, ఖైరతాబాద్ ప్రజలే మన పార్టీని గెలిపించి, ఆయన నిర్ణయం తప్పని నిరూపిస్తారనే నమ్మకం నాకున్నది అని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

నాగేందర్ అవకాశవాద రాజకీయాల కోసం వెళ్ళిండు అని అందరూ అంటున్నారు. గతంలో ఆసిఫ్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి మళ్ళీ రిపీట్ అవుతుంది. రెండు పడవల ప్రయాణం ఎప్పుడు కూడా మంచిది కాదని దానం విషయంలో అర్థం అవుతుంది. దానం నాగేందర్ పైన ఇచ్చిన ఫిర్యాదుపైన స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలి… అనర్హుడిగా ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

అవసరం అయితే సుప్రీంకోర్టు దాకా వెళ్లి మరి అనర్హుడిగా ప్రకటించేలా చేస్తాం.. మూడు నాలుగు నెలల్లోనే ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక వస్తుంది దానికి సిద్ధంగా ఉండాలి.. ద్రోహం చేసిన వారికి బుద్ధి చెప్పాలి అని అన్నారు.

సికింద్రాబాద్‌లో మన పోటీ కాంగ్రెస్‌తో లేనేలేదు, దానం నాగేందర్‌ను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదు.. గతంలో అంబర్‌పేట్‌లో ఓడిపోతే అదృష్టవశాత్తు సికింద్రాబాద్ ఎంపీ అయిండు కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి చేసిన అతిపెద్ద మూడు పనులు… కురుకురే ప్యాకెట్లు పంచడం, సీతాఫల్మండిలో రైల్వే లిఫ్ట్ ఓపెన్ చేయడం, సింటెక్స్ ట్యాంకులను ఓపెన్ చేయడం.. ఇవే కిషన్ రెడ్డి హైదరాబాద్‌కు చేసిన గొప్ప సేవ అని ఎద్దేవా చేశారు.

ఆయన సొంత నియోజకవర్గం అంబర్‌పేట్‌లో ఫ్లైఓవర్ కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టించండి అంటే ఇంకా నాన్చుతూనే ఉన్నారు.. మనం మాత్రం 36 ప్లై ఓవర్లు పూర్తి చేసినం.. కిషన్ రెడ్డికి ఒటేసేందుకు ఒక్క కారణం లేదు అని కేటీఆర్ విమర్శించారు.

హైదరాబాద్ నగరం బీఆర్ఎస్‌కు కోటగా మారింది. బీజేపీ, బీఅర్ఎస్ ఒకటే అనే మాటను నగర ప్రజలు నమ్మలేదు, అందుకే క్లీన్ స్వీప్ చేసినం. బీజేపీ రాముడిని అడ్డుపెట్టుకుని చేస్తున్న నాటకాన్ని ప్రజలు గమనించాలి అని అన్నారు.

కిషన్ రెడ్డికి దమ్ముంటే లిక్కర్ స్కాంలో ఏముందో కొర్టుకు చెప్పాలి, కిషన్ రెడ్డి ఎంచేసిండో చెప్పి ఓటు అడగాలి.. ఈరోజు సికింద్రాబాద్‌లో పోటీ ఒక విఫల ఎంపీ కిషన్ రెడ్డికి, అవకాశవాద ఎమ్మెల్యే దానంకు, ఇంకోవైపు నిబద్ధత కలిగిన పద్మారావుల మద్య ఉన్నది అని పేర్కొన్నారు.

అరోజు కవితమ్మను అరెస్టు చేయలేదు అని ప్రచారం చేసిన కాంగ్రెస్ ఈ రోజు ఏం అంటుంది. ఆరోజు సుప్రీం కోర్టులో కేసుంది కాబట్టే అరెస్ట్ చేయలేదు, కానీ ఈరోజు బీజేపీ మా పార్టీపై పగ పట్టింది అని అన్నారు.