mt_logo

పీవీకి భారతరత్న ప్రకటించాలి – కేసీఆర్

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించాలని, పీవీకి భారతరత్న బిరుదు ఇవ్వాలని సిఫారసు చేశామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వకపోవడం వెలితిగా ఉందని, ఇప్పటికైనా ఇవ్వాలని కేసీఆర్ కోరారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, మదన్ మోహన్ మాలవ్యకు భారతరత్న ప్రకటించడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాజపేయి, మాలవ్య భారతదేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటారని, భావితరాలకు వారు ఆదర్శమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల తరపున, వ్యక్తిగతంగానూ కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కేసీఆర్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *