ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా అనంతరం రాష్ట్ర మంత్రి వర్గాన్ని రద్దు చేస్తూ గవర్నర్ నరసింహన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించారు. రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడిందని, రాజకీయ పార్టీలు ప్రాంతాలవారీగా విడిపోయాయని, ఏ పార్టీ కూడా మెజారిటీ నిరూపించుకొనే పరిస్థితి కనపడటం లేదని వివరిస్తూ కేంద్రానికి గవర్నర్ ఒక నివేదికను సమర్పించారు. ముఖ్యమంత్రి పదవికి అర్హుడైన వ్యక్తి కూడా ఎవరూ కనపడటం లేదని అందులో వివరించారు. బిల్లును రెండు రోజుల్లో రాష్ట్రపతికి పంపించడం, తద్వారా రాష్ట్రపతి సంతకంతో ఆమోద ప్రక్రియ పూర్తికానుంది. ఈ సమయంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలా? లేక కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు నిర్ణయం తీసుకోవాలా? అనే అంశాలపై యూపీఏ ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు చేయాలని, వెంటనే సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ను ఆయన నివాసంలో కలిసి చర్చించినట్లు సమాచారం. వారు వ్యక్తపరిచిన అభిప్రాయాలను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి తెలియపరుస్తానని, గవర్నర్ నివేదిక, రాజ్యాంగపరమైన విషయాలను దృష్టిలో పెట్టుకుని సోనియా సరైన నిర్ణయం తీసుకుంటారని దిగ్విజయ్ వారితో అన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా విభజన జరిగిన నేపథ్యంలో ఒక ప్రాంత వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమిస్తే వేరే ప్రాంతం వారు ఒప్పుకోరని, అందువల్ల రాష్ట్రపతి పాలన తప్పదని కాంగ్రెస్ కోర్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం.
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- Bhu Bharathi: Mandatory survey for land sales causes several hardships
- రేవంత్ సర్కార్ తొలగించిన తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక ఇదే!
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!