కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నగరంలోని పరేడ్ గ్రౌండ్స్లో పలు పోస్టర్లు వెలిశాయి. సెప్టెంబర్ 17 సందర్భంగా అమిత్ షా.. హైదరాబాద్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న సభలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఏ విధంగా సాయపడిందో చెప్పాలని డిమాండ్ చేస్తూ పరేడ్ గ్రౌండ్స్ పరిధిలో పోస్టర్లు వెలిశాయి. కంటోన్మెంట్ యువత పేరుతో ఉన్న ఈ పోస్టర్లలో కేంద్ర ప్రభుత్వం ప్రశ్నల అస్త్రాలు సంధించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమిత్ షా చెప్పుల దగ్గర పెట్టిన నాయకుడు ఎవరో చెప్పాలంటూ కొన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన నాయకులు వీళ్లేనంటూ మరికొన్ని పోస్టర్లు కనిపించాయి. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ ఏ విధంగా సహకరించారో చెప్పాలంటూ 20 ప్రశ్నలను పొందుపరిచారు.