విశ్వనగరం హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గురువారం 17 కోట్ల రూపాయల వ్యయంతో పంజాగుట్ట గ్రేవ్ యార్డ్ కు నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పంజాగుట్ట గ్రేవ్ యార్డ్ కు నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జి వలన స్మశాన వాటికకు వెళ్లేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగి పోతాయని చెప్పారు. పాత గేట్ నుండి హైటెన్షన్ విద్యుత్ పోల్ వరకు వెడల్పు చేసినందున నాగార్జున సర్కిల్ నుండి కే.బి.అర్ పార్క్ జంక్షన్ కు వెళ్లే వాహనాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సాఫీగా ప్రయాణం కొనసాగుతుందని వివరించారు. గ్రేవ్ యార్డ్ కు వెళ్లేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు, ట్రాఫిక్ సమస్య శాశ్వత పరిష్కారం కోసం జిహెచ్ఎంసీ నుండి 17 కోట్ల రూపాయలను మంజూరు చేసి స్టీల్ బ్రిడ్జి నిర్మించడం జరిగిందని చెప్పారు. ఇందులో మొత్తం రోడ్డు విస్తీర్ణం 140 మీటర్లు కాగా అందులో అప్రోచ్ రిటర్నింగ్ వాల్ 57 మీటర్లు, 9.6 మీటర్ల ఫ్లై ఓవర్ మొత్తం 46 స్టీల్ గ్రీడర్స్ ఏర్పాటు చేసి పనులను పూర్తి చేసినట్లు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం నూతనంగా అండర్ పాస్ లు, ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, పుట్ పాత్ ల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు కోట్లాది రూపాయల వ్యయంతో కొనసాగుతున్నాయని వివరించారు. అనేక రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులను చేపట్టడం ద్వారా అనేక ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్య ను పరిష్కరిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. వీటితో పాటు ప్రజలకు మౌలిక వసతులను కల్పించే విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక చొరవతో దేశంలోని ఇతర నగరాల కన్నా హైదరాబాద్ మహా నగరం అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
- Revanth Reddy is a pathological liar and cheating people in a phased manner: KTR
- Is Revanth Reddy helping BJP win some elections in Telangana? Data says so
- BJP’s unilateral push for Godavari-Cauvery river linking detrimental to Telangana
- Is Revanth Reddy trying to sabotage the original Congress?
- KCR’s 4-hour-long TV interview creates record
- పద్మారావుకు మద్దతుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ పాదయాత్ర
- గురుకుల విద్యను తీర్చిదిద్దిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను గెలిపించాలి: కేసీఆర్
- కరీంనగర్లో బీజేపీ కోసం రేవంత్ బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టాడు: హరీష్ రావు
- మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తుంటే రెండు సార్లు కరెంటు పోయింది: ఎక్స్లో కేసీఆర్ పోస్ట్
- రేవంత్కు దమ్ముంటే హరీష్ రావు సవాల్కు స్పందించాలి: కేటీఆర్
- 2001లో జలదృశ్యంలో ప్రారంభమైన గులాబీ జెండా ప్రస్థానం.. నేడు దేశానికి ఆదర్శం: హరీష్ రావు
- తెలంగాణకు ఉన్న ఒక్క ఇంటి పార్టీ బీఆర్ఎస్: పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేటీఆర్
- బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- రేపు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ: కేటీఆర్
- రేవంత్కు సవాల్ విసిరి.. అమరవీరుల స్థూపం వద్దకు రాజీనామా లేఖతో వెళ్లిన హరీష్ రావు