mt_logo

మాకూ రైతుబంధు ఇవ్వండి… ఒడిశాలో రైతుల మహా పాదయాత్ర

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను ఒడిశాలో కూడా అమ‌లు చేయాల‌ని 10 వేల మంది రైతులు రాజధాని భువనేశ్వర్ కు మహా పాదయాత్ర చేపట్టారు. నవ నిర్మాణ్ కిసాన్ సభ ఆధ్వర్యంలో 7 రోజుల పాటు చేయనున్న ఈ మహా పాదయాత్రలో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు బంధు, రైతు భీమా, ఉచిత విద్యుత్ ప‌థ‌కాలు తమకూ అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అక్షయ్ కుమార్ అనే రైతు మాట్లాడుతూ… తెలంగాణలో రైతు సంక్షేమ పథకాల అమలు సాధ్యం అయినప్పుడు దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఎందుకు సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వాన్ని, ఒడిశా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

కాగా ఈ మహా పాదయాత్రను పోలీసులు అడ్డుకున్న‌ప్ప‌టికీ, త‌మ పాద‌యాత్ర‌ను కొన‌సాగించి భువ‌నేశ్వ‌ర్‌కు చేరుకుంటామ‌ని రైతులు స్ప‌ష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *