తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను ఒడిశాలో కూడా అమలు చేయాలని 10 వేల మంది రైతులు రాజధాని భువనేశ్వర్ కు మహా పాదయాత్ర చేపట్టారు. నవ నిర్మాణ్ కిసాన్ సభ ఆధ్వర్యంలో 7 రోజుల పాటు చేయనున్న ఈ మహా పాదయాత్రలో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు బంధు, రైతు భీమా, ఉచిత విద్యుత్ పథకాలు తమకూ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అక్షయ్ కుమార్ అనే రైతు మాట్లాడుతూ… తెలంగాణలో రైతు సంక్షేమ పథకాల అమలు సాధ్యం అయినప్పుడు దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఎందుకు సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వాన్ని, ఒడిశా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కాగా ఈ మహా పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నప్పటికీ, తమ పాదయాత్రను కొనసాగించి భువనేశ్వర్కు చేరుకుంటామని రైతులు స్పష్టం చేశారు.