mt_logo

తెలంగాణకు మద్ధతుగా సీమాంధ్రలో కొత్త రాజకీయ పార్టీ

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంఘీభావం ప్రకటించే వారి సంఖ్య సీమాంధ్రలో రోజురోజుకూ పెరుగుతోంది. మేధావులు, ఉద్యమకారులు, సాహిత్యకారులు అనేకమంది ఇప్పటికే తెలంగాణకు మద్ధతు పలుకుతుండగా ఇప్పుడు  కొత్తగా ఏర్పడ్డ ఒక రాజకీయ పార్టీ కూడా తెలంగాణకు మద్ధతుగా నిలుస్తోంది.

రావు సుబ్రహ్మణ్యం అనే యువకుడు నెలకొల్పిన “నవతరం పార్టీ” ఈ నెల 5వ తారీఖున “తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు – ఆవశ్యకత” అనే అంశంపై గుంటూరులో ఒక అవగాహనా సదస్సును నిర్వహిస్తోంది.

తెలంగాణ ఉద్యమం తరఫున వారికి ఇవే మా కృతజ్ఞతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *