mt_logo

మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

– ధూమ్ ధామ్ గా బతుకమ్మ సంభరాలు
– జాతిపిత మహాత్మా గాంధీజి జ్ఞాపకార్థం వారి 150 వ జన్మదిన వేడుకలు
– మలేషియా తెలంగాణ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక 2018-2020

మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి, మలేషియా బతుకమ్మ అట పాటలతో మార్మోగింది. మలేషియా కౌలాలంపూర్ లోని PPPM ఈవెంట్ హాల్ బ్రిక్ ఫీల్డ్స్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాసులు భారీగా తరలి వచ్చారు. సాంప్రదాయ దుస్తులతో, ఆకర్షణీయమయిన పూలతో చేసిన బతుకమ్మలను చిన్నా పెద్దా యువతులనే తేడా లేకుండా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని చాటేలా ఆడి పాడి సందడి చేసారు.

ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధులుగా తెలంగాణ వాటర్ రిసోర్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వీరమళ్ళ ప్రకాష్ రావు గారు, ఇండియన్ కౌన్సిలర్ అఫ్ మలేషియా శ్రీ నిషిత్ కుమార్ ఉజ్వల్ గారు, మరియు పలువురు తెలంగాణ ప్రముఖులు పాల్గొన్నారు.

వచ్చే సంవత్సరం జాతిపిత మహాత్మా గాంధీజి గారి 150 వ జన్మదినం కావున భారత ప్రభుత్వం వారి జ్ఞాపకార్థం ఈ సంవత్సరం పొడుగున గాంధీ గారి జన్మదిన వేడుకల్ని జరపాలని నిశ్చయించింది, ఇందులో భాగంగా మలేషియా తెలంగాణ అసోసియేషన్ మరియు ఇండియన్ హైకమిషన్ అఫ్ మలేషియా సంయుక్తంగా గాంధీ గారి పైన వీడియో ప్రెసెంటేషన్, పిల్లలకు వ్యాస పోటీలు, క్విజ్ మరియు చిన్న స్కిట్ చేసి అందులో పాల్గొన్న వారికీ మరియు విజేతలకు బహుమతులను అందజేశారు.

అందంగా అలంకరించిన బతుకమ్మలను ఎంపిక చేసి ముఖ్య అతిధుల చేతుల మీదుగా 6 గ్రామ్ ల బంగారం బహుమతులగా అందజేశారు. అదేవిధంగా లక్కీ డ్రా విజేతలకు 6గ్రాముల బంగారం బహుమతులగా అందజేశారు ఈ కార్యక్రమానికి దాదాపు వెయ్యి మంది కి పైగా పాల్గొని విజయవంతం చేశారు.

ప్రకాష్ గారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ప్రత్యేకతను ఆయన వివరించారు, ప్రవాస తెలంగాణ వాసులు తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా బతుకమ్మ మరియు తెలంగాణ పండుగలు జరుపోకోవడం చాల సంతోషంగ ఉందన్నారు. కెసిఆర్ గారు మొట్టమొదట మలేసియా వచ్చినపుడు ఏర్పాటు చేసిన మొదటి సమావేశం తరువాత మొదటి బతుకమ్మ వేడుకలతో మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. ఈ సంబరాలను ప్రతి ఏటా ఘనంగానిర్వహిస్తున్న మలేషియా తెలంగాణ అసోసియేషన్ ను అభినందించారు.

మైటా ప్రెసిడెంట్ సైదం తిరుపతి మాట్లాడుతూ మలేషియా తెలంగాణ అసోసియేషన్ ప్రారంభం కావడానికి కృషిచేసిన వ్యక్తి ప్రకాష్ గారు అని అతని ప్రోత్సాహమే అని అన్నారు. ఈ సంవత్సరం ఐదు రోజుల పాటు తెలుగు వారు వుండే ప్రతి చోట బతుకమ్మ వేడుకలను తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ఎంతో ఘనంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య స్పాన్సర్ గా వచ్చిన స్పేస్ విజన్ గ్రూప్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే కో స్పాన్సర్స్ జాస్ బెలూన్ అండ్ డెకొరేటర్స్, సంక్రాంతి ఇండియన్ క్యూసిన్, ప్రబలీ రెస్టారెంట్, మై 81రెస్టారెంట్, తడ్కా మరియు MTR స్పైసెస్ గా ముందుకి వచ్చిన వారికీ కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ బతుకమ్మసంబరాలను విజయవంతం చేయడానికి సహకరించిన మైటా కోర్ కమిటీ ని వాలంటీర్లు గా ముందుకి వచ్చిన సభ్యులను అయన అభినందించారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్ కార్యక్రమాలన్నీ ఎంతగానో ప్రోత్సహిస్తున్న మీడియా మిత్రులకు అయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.

మలేషియా తెలంగాణ అసోసియేషన్ 2018-2020 కి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నికయినది, బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ నూతన కార్యవర్గాన్ని ముఖ్య అతిధులుగా విచ్చేసిన తెలంగాణ వాటర్ రిసోర్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వీరమళ్ళ ప్రకాష్ రావు గారు ప్రకటించారు.

నూతన కార్యవర్గ సభ్యుల వివరాలు
ప్రెసిడెంట్ – సైదం తిరుపతి
డిప్యూటీ ప్రెసిడెంట్ – చొప్పరి సత్య
వైస్ ప్రెసిడెంట్ – బూరెడ్డి మోహన్ రెడ్డి
వైస్ ప్రెసిడెంట్ – నరేంద్రనాథ్
జనరల్ సెక్రటరీ – రవి చంద్ర
జాయింట్ సెక్రటరీ – సందీప్
ట్రేసరర్- మారుతీ
జాయింట్ ట్రేసరర్ – రవీందర్ రెడ్డి

ఎగ్జిక్యూటివ్ మెంబర్స్
– రవి వర్మ, కృష్ణ వర్మ, కిరణ్ గాజంగి, హరి ప్రసాద్, వివేక్, రాములు, సుందర్, కృష్ణ రెడ్డి

ఉమెన్స్ వింగ్
ప్రెసిడెంట్ – కిరణ్మయి
వైస్ ప్రెసిడెంట్ – స్వప్న
వైస్ ప్రెసిడెంట్ – అశ్విత

యూత్ వింగ్
యూత్ ప్రెసిడెంట్ – కార్తీక్
యూత్ వైస్ ప్రెసిడెంట్ – కిరణ్ గౌడ్
యూత్ వైస్ ప్రెసిడెంట్ – రవితేజ

కల్చరల్ వింగ్ మెంబర్స్
– విజయ్ కుమార్, చందు, రామ కృష్ణ, నరేందర్, రంజిత్, సంతోష్, ఓం ప్రకాష్, అనూష, దివ్య, సాహితి, సాయిచరని, ఇందు

మైగ్రంట్ వింగ్ మెంబర్స్
– ప్రతీక్, మధు, శ్రీనివాస్, రఘునాథ్, సందీప్ గౌడ్

అనంతరం ఈ నూతన కార్యవర్గానికి ప్రకాష్ గారు అభినందనలు తెలియజేసారు.

ఈ కార్యక్రమములో నూతన కార్యవర్గ సభ్యులు మరియు కోర్ కమిటి సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *