నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత నేడు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ వరంగల్ ఎన్కౌంటర్ దురదృష్టకరమని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శృతి ఎన్కౌంటర్ లో చనిపోవడం బాధాకరమని అన్నారు. త్వరలో వరంగల్ లోక్ సభకు జరిగే ఎన్నికల్లో గెలిచి తీరుతామని, ఇక్కడ ధర్నాలు చేయిస్తున్న వామపక్షాల నేతలు ఆంధ్రాలో ఎందుకు ధర్నాలు చేయడం లేదని ఆమె ప్రశ్నించారు.
టీడీపీలో జైలుకు వెళ్ళిన వారికే టిక్కెట్లు ఇస్తున్నారని, టీడీపీలో పదవుల్లో చోటులేదనే ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి దాడి చేయించాడని కవిత మండిపడ్డారు. ప్రధాని మోదీది కార్పొరేట్ ప్రభుత్వమని, పసుపు రైతుల సమస్యలు కేంద్రం పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు.