Mission Telangana

ఏడాది జీతం విరాళంగా ఇచ్చిన ఎంపీ కవిత!

రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ జాగృతి సంస్థ ఈచ్ వన్ అడాప్ట్ వన్ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. రైతు కుటుంబాలను ఆదుకునే క్రమంలో నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన ఏడాది జీతాన్ని విరాళంగా ప్రకటించారు. తన ఏడాది జీతాన్ని ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఆమె అందించనున్నారు.

మరోవైపు తెలంగాణ జాగృతి సంస్థ చేపట్టిన రైతు కుటుంబాలను దత్తత తీసుకునే కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది. రైతు కుటుంబాలను ఆదుకునేందుకు వివిధ సంస్థలు, ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం చెన్నైకి చెందిన స్మార్ట్ ట్రైనింగ్ రిసోర్సెస్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్లు అర్చనా రామ్, రామ్ లు రూ. లక్ష ను చెక్కు రూపంలో ఎంపీ కవితకు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *