mt_logo

సింగరేణిలో త్వరలో 274 పోస్టుల భర్తీ!

సింగరేణి సంస్థలో వరుస నోటిఫికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల రెండు నోటిఫికేషన్లు జారీ చేయగా తాజాగా 274 పోస్టుల భర్తీకి సంబంధించి మూడవ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. పోస్టుల వివరాలు కిందివిధంగా ఉన్నాయి. మేనేజిమెంట్ ట్రైనీ ఐటీ(4), జూనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ మెకానికల్(5), హైడ్రోజియాలజిస్ట్(1), ఫారెస్ట్ ఆఫీసర్(4), ఫారెస్ట్ అసిస్టెంట్(4), ఫిజియోథెరపిస్ట్(3), జూనియర్ నర్స్(69), ఫార్మసిస్ట్(2), లాబ్ టెక్నీషియన్(4), ఈపీ ఫిట్టర్(63), ఈపీ ఎలక్ట్రీషియన్(29), ఎలక్ట్రిక్ సూపర్ వైజర్ ఫర్ వర్క్ షాప్స్(11), వెల్డర్ ట్రైనీ(70), లా ఆఫీసర్(2) పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నారు.

ఇదిలాఉండగా మొదటి నోటిఫికేషన్ లో ప్రకటించిన 1178 పోస్టుల భర్తీకి రాత పరీక్షలు పూర్తయ్యాయని, రెండవ నోటిఫికేషన్ కు సంబంధించిన 1016 పోస్టుల భర్తీకి అక్టోబర్ 11న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. రాత పరీక్షకు హాజరయ్యే 84 వేలమంది అభ్యర్థుల హాల్ టిక్కెట్లను ఆన్ లైన్ లో ఉంచామని, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మంచిర్యాల, ఆదిలాబాద్, హైదరాబాద్ లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు శ్రీధర్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *