mt_logo

తెలంగాణపై మనసులో మాట కక్కిన మోత్కుపల్లి

శనివారం నాడు నలగొండ జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో విలేకరులతో పిచ్చాపాటీ మాట్లాడుతూ తెదేపా నేత మోత్కుపల్లి నరసింహులు మనసులో మాట కక్కేశాడు. “తెలంగాణ వచ్చేది కాదు సచ్చేది కాదు” అని ఆయన నోటినుంచి వచ్చిన మాటలు అక్కడి విలేకరులను, చుట్టున్న ప్రజలను నిశ్చేష్టులను చేశాయి.

గత కొంతకాలంగా తెలంగాణ ఉద్యమ నాయకత్వంపై దొంగదాడి చేస్తున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుల అసలు రంగు మరోసారి బయటపడింది.
పైకి తామేదో తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు కష్టపడుతున్నట్టు బిల్డప్ ఇచ్చే తెలంగాణ తెదేపా మేకవన్నె పులుల అసలు రంగు ఇది.

తెలంగాణ ఉద్యమం బతికుంటే తమ పార్టీ బతకదని అందుకే ఏదో ఒక కుట్ర చేసి ఉద్యమం గొంతు నులిమేయాలని చంద్రబాబు నాయుడు పన్నిన పన్నాగం విలేకరుల సాక్షిగా బట్టబయలైంది.

ఈ సొల్లు మాటలు మాట్లాడుతున్న మోత్కుపల్లి నరసింహులు, అతని వెనకుండి మాట్లాడిస్తున్న చంద్రబాబు తెలుసుకోవాల్సిన నిజమేమిటంటే – “తెలంగాణ వచ్చేదీ ఖాయం, తెలుగుదేశం పార్టీ సచ్చేదీ ఖాయం”

నరసింహులు లాంటి నాయకుల వల్ల తెదేపాకు చావు అనుకున్నదానికంటే తొందరగానే సిద్ధిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *