రాష్ట్రం ప్రభుత్వం మరో 10,105 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వాటిలో గురుకులాల్లోనే 9,096 పోస్టులు ఉన్నాయి. మరో 995 పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో జిల్లా ఎంపిక కమిటీ ద్వారా మరో 14 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. తాజాగా ఆర్థిక శాఖ ఇచ్చిన అనుమతితో ఇప్పటిదాకా మొత్తం 45,325 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినైట్టెంది. వీటిలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి వివిధ దశల్లో ఉన్నవి 20,391 ఉద్యోగాలు. తాజా ప్రకటనతో కలిపి ఇప్పటిదాకా 45,325 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని, త్వరలోనే మరిన్న ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని టీఎస్పీఎస్సీ అధికారులు పేర్కొన్నారు.

