mt_logo

రాకేష్ కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

శుక్రవారం రైల్వే బలగాల కాల్పుల్లో మరణించిన సైనిక ఉద్యోగార్థి, మన వరంగల్‌ బిడ్డ రాకేశ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు, ఆ కుటుంబంలో అర్హులైనవారికి తగిన ప్రభుత్వోద్యోగం ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాల వల్లనే రాకేశ్‌ బలైపోయాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ బిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. సైనికులపై, వారి కుటుంబాల పట్ల ముఖ్యమంత్రి అవ్యాజమైన అభిమానాన్ని చాటుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో గల్వాన్‌ లోయలో చైనా కుట్రకు బలైపోయిన కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబాన్ని, అలాగే ఆనాటి ఘటనలో అమరులైన ఇతర రాష్ట్రాల జవాన్ల కుటుంబాలను సైతం ఆదుకొన్నారు. స్వయంగా జార్ఖండ్‌, చండీగఢ్‌ ప్రాంతాలకు వెళ్లి.. అమరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *