mt_logo

‘గిఫ్ట్ ఏ స్మైల్’ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యేలు..

ఐటీ, మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా పేదల ముఖాలపై చిరునవ్వులు చూడాలనే ఉద్దేశంతో గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు అంబులెన్సుల కొనుగోలు కోసం చెక్కుల రూపంలో మంత్రి కేటీఆర్ కు అందించారు. తాజాగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి అంబులెన్సుల కోసం రూ. 20.50 లక్షలు విలువ చేసే రెండు చెక్కులను మంత్రి కేటీఆర్ కు అందించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వారిని అభినందించారు.

ఇదిలాఉండగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా కార్మిక శాఖామంత్రి సీహెచ్ మల్లారెడ్డి తరపున ప్రభుత్వానికి సమకూర్చిన కరోనా టెస్టింగ్ అంబులెన్సులను ఐటీ మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్టీ ఇంచార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *