mt_logo

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

హైదరాబాద్ లో ఈనెల 17వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల కార్యక్రమ ఏర్పాట్లను మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్ లు పరిశీలించారు. అనంతరం, ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం మీదుగా ఇందిరాపార్కు వద్ద గల ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను పర్యటించారు. 17వ తేదీన పీపుల్స్ ప్లాజా నుండి అంబేడ్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు ఊరేగింపుగా చేరుకొని అక్కడ నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిధిగా హాజరవుతారని మంత్రులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, రసమయి బాలకిషన్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, గిరిజన సహకార ఆర్థికాభివృద్ధి సంస్థ చైర్మన్ రామచంద్ర నాయక్, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *