mt_logo

కేటీఆర్ కృషి వల్లే హైదరాబాద్ కు అంతర్జాతియ ఖ్యాతి : మంత్రి తలసాని

నిరుపేదల అభివృద్ధి,సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బంజారాహిల్స్ లోని శ్రీరామ్ నగర్ లో 2 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించే మల్టి పర్ఫస్ కమ్యూనిటీ హాల్ పనులను ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మితో కలిసి మంత్రి తలసాని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ… నిరుపేదలు నివసించే బస్తీల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో అన్ని రంగాల్లోనూ హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి రావడానికి కేటీఆర్ నిరంతర కృషి కారణమని కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *