తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో జూలై 3న లండన్లో నిర్వహిస్తున్న ‘టాక్-లండన్ బోనాల జాతర’ పోస్టర్ని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం హైదరాబాద్లోని తన నివాసంలో ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడమే కాకుండా, ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న టాక్ సంస్థను మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన ఎమ్మల్సీ కల్వకుంట్ల కవితను ఆహ్వానించినట్టు టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు , టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, ఎన్నారై నాయకులు రాజ్ కుమార్ శానబోయిన, శ్రీనివాస్ వల్లాల పాల్గొన్న వారిలో ఉన్నారు.