తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్ రెడ్డి 126వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళులు అర్పించారు. సురవరం ప్రతాపరెడ్డి భాష, సాహిత్యము, సాంస్కృతిక పునరుజ్జీవనం, ప్రాంత అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని ఈ సందర్భంగా కొనియాడారు. సురవరం జీవిత చరిత్ర మూడో తరానికి తెలియాలని.. ఆయన కీర్తి చిరస్థాయిగా వెలగాలనే ఆకాంక్షతో ఆయన విగ్రహాన్ని వనపర్తిలో ఆవిష్కరించినట్లు నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. భూగర్భం నుంచి అంతరిక్షం వరకు.. సాహిత్యం నుంచి సైన్స్ వరకు సురవరం ప్రతాపరెడ్డి స్పృశించని అంశం లేదని, సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ, సాంఘిక అంశాలను సునిశితంగా పరిశీలించి ప్రస్తావించారని తెలియజేశారు. ఆయన చేసిన సేవలు మరింత ప్రాచుర్యంలోకి రావాల్సిన అవసరం ఉందని, ఆయన రచనలను రెండు సంపుటాలుగా తీసుకొచ్చామని.. మూడో సంపుటాన్ని తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తీసుకొస్తామని అన్నారు. 1952లో సాధారణ ఎన్నికల్లో వనపర్తి శాసనసభ్యుడిగా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి.. ఉమ్మడి పాలమూరు జిల్లాకు, వనపర్తి నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు ఇప్పటికీ గుర్తుండిపోతాయని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
- Stunning clicks of rich wildlife in HCU
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్