mt_logo

కిషన్ రెడ్డి పార్లమెంటులో ఎప్పుడైనా తెలంగాణ కోసం మాట్లాడారా ? : మంత్రి నామా నాగేశ్వరరావు

తెలంగాణ మీద కక్ష తోనే కేంద్రం సహకరించడం లేదని టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. మంగళవారం నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యారం, ఖమ్మం ప్రాంతంలో ఖనిజ సంపద ఉందని సర్వేలు ఉన్నాయని, కానీ కేంద్రం బయ్యారం ఉక్కు పరిశ్రమకు సహకరించడం లేదని అన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు మీద కూడా కేంద్రం మెలికలు పెట్టిందని, తెలంగాణలో మాత్రమే జాతీయ రహదారుల ఏర్పాటు కోసం భూ సేకరణ వ్యయంలో 50 శాతం వాటా రాష్ట్రం మాత్రమే భరించేలా చేసారని ఆయన మండిపడ్డారు.రాష్ట్రం అవసరాల కోసం కేంద్రంతో ఎప్పుడైనా కిషన్ రెడ్డి మాట్లాడారా ? అని ఆయన ప్రశ్నించారు. మేము తెలంగాణ కోసం పార్లమెంటులో మాట్లాడితే అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణకు ప్రాజెక్టులు తీసుకువస్తే దండ వేసి దండం పెడతామని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలో బీజేపీ ప్రజావ్యతిరేక పాలన చేస్తోందని ఆయన అన్నారు. రైతులకు, నిరుద్యోగులకు, సామాన్యుడికి కూడా బడ్జెట్‌తో ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని మంత్రి నామా అసంతృప్తి వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *