mt_logo

పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ లండన్ పర్యటన… ఘనంగా స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు

తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం యూకేలో పర్యటిస్తున్నది. ఇందులో భాగంగా లండన్‌కు చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు భారతీయులు, యూకే టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ నె 18 నుంచి 26 వరకు సాగనున్న ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్‌ యూకేలోని ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు, వాణిజ్యవేత్తలతో సమావేశమవుతారు. అనంతరం 22 నుంచి 26వ తేదీ వరకు దావోస్‌లో నిర్వహించే ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సదస్సులో మంత్రి పాల్గొంటారు. ఈ నెల 18నుంచి 21వ తేదీవరకు నాలుగురోజులపాటు కేటీఆర్‌ యూకే ప్రపంచస్థాయి కంపెనీల అధిపతులతో వరుసగా భేటీ కానున్నారు. యూకే ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించే రెండు రౌండ్‌టేబుల్‌ సమావేశాల్లోనూ ఆయన పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, ఇక్కడి మౌలిక సదుపాయాల గురించి వారికి వివరిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *