mt_logo

తెలంగాణలో డ్రోన్స్ వినియోగించి వ్యవసాయం చేస్తోన్న పలువురు రైతులు… అభినందించిన కేంద్ర మంత్రి

ఆధునిక పరిజ్ఞానాన్ని, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో తెలంగాణలోని నగరాలే కాదు మారుమూల గ్రామీణ ప్రాంతాలూ దిట్ట. తెలంగాణ రాష్ట్రంలో పలువురు రైతులు రెండేళ్లుగా డ్రోన్స్‌ ను వినియోగిస్తూ వ్యవసాయం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం తెలంగాణకు చెందిన ముగ్గురు రైతులు, హైదరాబాద్‌కు చెందిన డ్రోన్‌ స్టార్టప్‌ వ్యవస్థాపకులతో వర్చువల్‌ వేదికగా మాట్లాడారు. వ్యవసాయ రంగంలో డ్రోన్‌లను సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవచ్చనేది ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో కిసాన్‌ డ్రోన్స్‌ పేరుతో వ్యవసాయ రంగంలో డ్రోన్స్‌ను వినియోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రైతుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నట్లు మారుత్‌ డ్రోన్స్‌ స్టార్టప్‌ వ్యవస్థాపకులు ప్రేమ్‌ తెలిపారు. ఇటీవల నీతి ఆయోగ్‌లో నిర్వహించిన డ్రోన్స్‌ కార్యక్రమంలోనూ తాము పాల్గొని, మంత్రితో సమావేశమై డ్రోన్‌ టెక్నాలజీని ఏయే రంగాల్లో వినియోగిస్తున్నామని వివరించామని ఆయన చెప్పారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *