mt_logo

సివిల్స్ విజేతలకు మంత్రి కేటీఆర్ అభినందనలు

సివిల్స్ 2021లో ర్యాంకులు సాధించిన వారిని మంత్రి కేటీఆర్ అభినందించారు. సివిల్స్ ఫ‌లితాల‌తో సంక్ప‌లం, ప‌ట్టుద‌ల‌కు చెందిన‌ కొన్ని అద్భుత‌మైన క‌థ‌లు వెలుగులోకి వ‌చ్చిన‌ట్లు ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సివిల్స్‌లో అసాధార‌ణ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన టాప్ ముగ్గురు అమ్మాయిల‌కు మంత్రి కేటీఆర్ ప్ర‌త్యేకంగా బెస్ట్ విషెస్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్స్‌కు ఎంపికైన ర్యాంక‌ర్ల‌ను కూడా మంత్రి కేటీఆర్ మెచ్చుకున్నారు. మీ ప్ర‌తిభ‌, ప్ర‌య‌త్నాల‌తో ఈ దేశాన్ని మీరు ముందు ఉండి న‌డుపుతార‌ని ఆశిస్తున్న‌ట్లు మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో అభిప్రాయ‌ప‌డ్డారు. కాగా సివిల్స్ 2021 ర్యాంక‌ర్ల‌ను సోమ‌వారం ప్ర‌క‌టించగా… భూపాలప‌ల్లికి చెందిన యువ‌కుడు న‌రేశ్‌కు 117వ ర్యాంక్, నిజామాబాద్ యువ‌తి స్నేహ‌కు 136వ ర్యాంకు, సూర్యాపేట‌కు చెందిన చైత‌న్య‌రెడ్డికి 161వ ర్యాంకులు వ‌చ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *