mt_logo

మహీంద్రా 3,00,001వ ట్రాక్టర్ తెలంగాణలో… ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా తన 3,00,001వ ట్రాక్టర్‌ను తెలంగాణ ప్లాంట్‌లో తయారుచేసింది. ఈ సందర్భంగా జహీరాబాద్‌లోని మహీంద్రా ప్లాంట్‌లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయగా… ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మహీంద్రా 3,00,001వ ట్రాక్టర్ ను ఆవిష్కరించిన అనంతరం దాన్ని నడిపారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ‘హేయ్… ఆనంద్ మహీంద్రా జీ… నన్ను చూడండి… మీ ఉత్పత్తులకు ఎంత చక్కగా ప్రచారం కల్పిస్తున్నానో! అందుకని మీరు మా రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమలు స్థాపించాల్సి ఉంటుంది‘ అంటూ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రాను ఉద్దేశించి చమత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *