mt_logo

కంటోన్మెంట్ ప్రజల బాధలు పట్టవా ? : కేంద్ర మంత్రులకు కేటీఆర్ ట్వీట్

హైద‌రాబాద్ ప‌రిధిలోని కంటోన్మెంట్‌ సమస్యలు పరిష్కరించలేని పక్షంలో దానిని జీహెచ్ఎంసీలో కలపాలని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్. కంటోన్మెంట్ రోడ్లను మూసివేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రజల బాధలు ఎందుకు గుర్తించడం లేదని కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, కిషన్ రెడ్డిలకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కంటోన్మెంట్ లో నిబంధనల ఉల్లంఘనలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, జూనియ‌ర్ మంత్రికి కంటోన్మెంట్‌లో నెల‌కొన్న క్షేత్ర‌స్థాయి పరిస్థితులు తెలియ‌వు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కంటోన్మెంట్‌లో 21 రోడ్లు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా మూసివేశారు. మీ ప్ర‌భుత్వం మాత్రం 2 గేట్లు మాత్ర‌మే మూసివేశామ‌ని చెబుతుంది. కంటోన్మెంట్ బోర్డు స్థానికుల‌కు మౌలిక స‌దుపాయాలు క‌ల్పించక‌పోతే.. కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో క‌లిపేయాల‌ని కేటీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *