mt_logo

తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా బ్రిటన్, స్విట్జర్లాండ్ లో పర్యటించనున్న మంత్రి కేటీఆర్

దావోస్ వేదికగా జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదికలో ప్రసంగించేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్ ప్రయాణమయ్యారు. నేటి నుంచి పది రోజుల పాటు బ్రిటన్, స్విట్జర్లాండ్ లో పర్యటించి, తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పలు సమావేశాలు నిర్వహించనున్నారు. మొదట లండన్‌లో మూడు రోజుల పాటు వివిధ సంస్థల అధిపతులు, సీఈవోలతో భేటీ అయ్యి, తెలంగాణలో వారి కంపెనీలను ఆహ్వానించనున్నారు. ఆ తర్వాత ఈ నెల 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వేదికగా జరిగే ప్రపంచ ఆర్ధికవేదిక సదస్సులో కేటీఆర్‌ పాల్గొంటారు. ఆ సదస్సులో వివిధ దేశాల రాజకీయ, అధికార, వ్యాపార ప్రముఖులతో సమావేశం కానున్నారు.ఎమర్జింగ్ టెక్నాలజీస్ ద్వారా సామాన్యులకు మెరుగైన సేవలు అన్న అంశంపై ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో కేటీఆర్‌ ప్రసంగించనున్నారు. తిరిగి ఈ నెల 26న రాష్ట్రానికి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో కేటీఆర్‌ వెంట పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్​ రంజన్​, ఇతర అధికారుల బృందం ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *