రంగారెడ్డి జిల్లా పరిధిలోని మహేశ్వరంలో మలబార్ జెమ్స్, జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… మలబార్ గ్రూప్ అఫ్ కంపెనీకి అభినందనలు తెలియజేసారు. రాష్ట్రంలో రూ. 750 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ఈ కంపెనీ ద్వారా 2,750 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నట్లు తెలిపారు. ఇప్పటికే మలబార్ కంపెనీ తెలంగాణలో 17 రిటైల్ షోరూమ్స్ను ప్రారంభించి, వెయ్యి మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పించిందని వెల్లడించారు. కాగా ఈ షోరూమ్స్ను మరింత విస్తరించేందుకు కంపెనీ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, పరిశ్రమల డైరెక్టర్ డీ కృష్ణ భాస్కర్, మలబార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అహ్మద్ ఎంపీ, వైస్ చైర్మన్ అబ్దుల్ సలాం కేపీ పాల్గొన్నారు.

