mt_logo

మంత్రి కేటీఆర్ కరీంనగర్ పర్యటన… మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ కరీంనగర్ నగరంలోని మానేరు వంతెనపై నగరపాలక సంస్థకు చెందిన మిషన్ భగీరథ వాటర్ పైలాన్ ప్రారంభోత్సవం చేశారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ నేతృత్వంలో ప‌లువురు ప్రజాప్రతినిధులు కేటీఆర్‌కు ఘన స్వాగ‌తం ప‌లికారు. త‌దుప‌రి 24 గంటలు మంచి నీటి సరఫరా, మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసారు. త‌దుప‌రి రాంనగర్, పద్మానగర్ ఏరియాలో గల మార్క్ ఫేడ్ గ్రౌండ్ లో నగరపాలక సంస్థ, స్మార్ట్ సిటీ వివిద అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు. మొత్తంగా న‌గ‌రంలో రూ.1025 కోట్ల ప‌నుల‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. చొప్పదండి నియోజ‌క‌వ‌ర్గంలోని చొప్పదండి మున్సిప‌ల్ ప‌రిధిలో రూ.38 కోట్లతో ఏర్పాటుచేస్తున్న సెంట్రల్‌ లైటింగ్ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయ‌డంతో పాటుగా అక్కడ జ‌రిగే స‌భ‌లో ప్రసంగించనున్నారు. తిరిగి సాయంత్రం నాలుగు గంట‌ల‌కు క‌రీంన‌గ‌ర్ కార్పొరేష‌న్‌తో పాటుగా క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో జ‌రుగుతున్న అబివృద్ధి ప‌నుల‌పై స‌మీక్ష నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *