రాష్ట్ర వ్యాప్తంగా 12 నుండి 15 సంవత్సరాల పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని కోరారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సీఎం కేసీఆర్ విద్యా వైద్యానికి పెద్ద పీట వేస్తున్నారని తెలియజేసారు. బుధవారం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి సబిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో 12 సంవత్సరాల పైబడిన పిల్లలు 15 లక్షలు ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. వారందరికి వ్యాక్సిన్ వేయించడానికి తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు టీకా వేయించే బాధ్యత తీసుకోవాలన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ అన్ని రకాల చర్యలు తీసుకున్నారని, వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. అన్ని రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రాన్ని మార్గదర్శకంగా తీసుకుంటున్నాయని తెలిపారు. కరోనా సమయంలో వైద్య సిబ్బంది, అంగన్ వాడీ టీచరర్లు, ఆశవర్కర్లు, మున్సిపల్ సిబ్బంది ప్రతి ఇంటికి పోయి ఫివర్ సర్వే చేయడం వలన మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో రాష్ట్ర వ్యాప్తంగా 33 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయబోతున్నాట్లు పేర్కొన్నారు. నగరంలో 250 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో ఇంగ్లీష్ విద్యను అమలు చేయడం పై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఆమె పేర్కొన్నారు.
- Stunning clicks of rich wildlife in HCU
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్