హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి ఓఆర్ఆర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 138 కోట్ల వ్యయంతో బాచుపల్లి రోడ్డు విస్తరణలో భాగంగా ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. భవిష్యత్ లో హైదరాబాద్ మహానగరం మరింత విస్తరించనుందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని శివార్లలో మౌలిక వసతులు పెంచుతున్నామని అన్నారు. ప్రస్తుతం నగర శివారులోని గ్రామాలన్నీ మున్సిపాలిటీలుగా మారాయని.. గతంలో వారానికోసారి మంచినీరు వచ్చేదని, ఇప్పడు ఆ పరిస్థితి లేదని తెలిపారు. అనంతరం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాజులరామారంలో పచ్చదనంతో పాటు ఆహ్లాదం, ఆరోగ్యం అందే విధంగా 450 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన “ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్కు” ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, నిజాంపేట మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీలు శంభి పూర్ రాజు, సురభి వాణి దేవి తదితర నేతలు పాల్గొన్నారు.
- Has Congress govt’s irrigation water mismanagement led to drought in Telangana?
- KTR challenges Revanth Reddy to contest from Malkajgiri
- MP Ranjith Reddy betrayed BRS; will be defeated this time: KTR
- Revanth stirs a hornet’s nest by planning to scrap some districts in Telangana
- It’s not a money laundering case but a political laundering case: MLC Kavitha
- ఇది ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేటీఆర్
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన కేటీఆర్
- ఈటెల రాజేందరన్న హుజూరాబాద్, గజ్వేల్లలో ఓడిపోతే మల్కాజ్గిరికి వచ్చిండు: కేటీఆర్
- రేవంత్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరిన కేటీఆర్
- సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో వస్తున్న ఆరోపణలను ఖండించిన హరీష్ రావు కార్యాలయం
- ఏప్రిల్ 13న చేవెళ్ళలో కేసీఆర్ బహిరంగ సభ
- 180 మంది రైతులు, 38 మంది ఆటో సోదరులు చనిపోతే కాంగ్రెస్ నుండి స్పందన లేదు: హరీష్ రావు
- రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రా లేక బీజేపీ ముఖ్యమంత్రా: హరీష్ రావు
- అన్నదాతకు అండగా కేసీఆర్.. త్వరలో ఎండిన పంటల పరిశీలన
- నచ్చినోళ్లు జేబులో, నచ్చనోళ్లు జైల్లో.. ఇదే బీజేపీ వైఖరి: హరీష్ రావు