mt_logo

బాచుపల్లి ఓఆర్ఆర్ ఫ్లైఓవర్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి ఓఆర్ఆర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 138 కోట్ల వ్యయంతో బాచుపల్లి రోడ్డు విస్తరణలో భాగంగా ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. భవిష్యత్ లో హైదరాబాద్ మహానగరం మరింత విస్తరించనుందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని శివార్లలో మౌలిక వసతులు పెంచుతున్నామని అన్నారు. ప్రస్తుతం నగర శివారులోని గ్రామాలన్నీ మున్సిపాలిటీలుగా మారాయని.. గతంలో వారానికోసారి మంచినీరు వచ్చేదని, ఇప్పడు ఆ పరిస్థితి లేదని తెలిపారు. అనంతరం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాజుల‌రామారంలో పచ్చదనంతో పాటు ఆహ్లాదం, ఆరోగ్యం అందే విధంగా 450 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన “ఆక్సిజన్ అర్బ‌న్ ఫారెస్ట్ పార్కు” ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, నిజాంపేట మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీలు శంభి పూర్ రాజు, సురభి వాణి దేవి తదితర నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *