mt_logo

మహిళా పారిశ్రామిక పార్కును ప్రారంభించిన మంత్రి కేటీఆర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వం మహిళలు కోసం ప్రత్యేక ఇండస్ట్రీయల్ పార్క్ ను ఏర్పాటు చేసింది. సంగారెడ్డిలోని సుల్తాన్ పూర్ లో ఏర్పాటు చేసిన ఈ మహిళా పారిశ్రామిక పార్కును రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సుల్తాన్‌పూర్‌లో దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో మహిళల కోసం ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్క్ పైలాన్ ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించి, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ పార్క్ లో మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. మహిళా పారిశ్రామిక పార్కులో తమ వ్యవస్థాపక ప్రయాణాన్ని ప్రారంభించే వారికి తన అభినందనలు తెలుపుతూ… మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *