mt_logo

జలదృశ్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ట్యాంక్ బండ్ వద్ద జలదృశ్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఆవిష్కరించి, పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా… ‘ఏ జలదృశ్యంలో అయితే ఉద్యమనాయకుడు కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ఉద్భవించిందో, ఏ జలదృశ్యంలో అయితే బాపూజీ ఇంటిని అవమానకరంగా అప్పటి ప్రభుత్వం కూల్చివేసిందో.. ఈ రోజు అక్కడే శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించుకున్నాం. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేశాం’ అని మంత్రి కేటీఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *