mt_logo

ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన వ్యక్తికి మంత్రి కేటీఆర్ సహాయం

విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తికి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహాయం చేయడానికి ముందుకొచ్చారు. వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ గాజుల రామారంకు చెందిన సత్యనారాయణ 2021 మేలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులూ కోల్పోయాడు. తరువాత తన కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు. కూలి పని చేస్తూ అతని భార్య కుటుంబ బాధ్యతను చేపట్టింది. భోజనం కూడా చేయలేని స్థితిలో ఉన్న సత్యనారాయణకు అతని 5 ఏళ్ల కూతురు తినిపిస్తున్న ఫోటోను సామాజిక మాధ్యమాల్లో చూసిన మంత్రి కేటీఆర్ సత్యనారాయణ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. 

రెండు చేతులు కోల్పోయిన తనకు వికలాంగుల పింఛను మంజూరు చేయాలని.. ఇంటి అద్దె కూడా చెల్లించలేకపోతున్నందుకు తమకు ఒక ఇల్లు కూడా కేటాయించాలని సత్యనారాయణ విజ్ఞప్తి చేయగా… వెంటనే అవి సమకూర్చాలని కేటీఆర్ అధికారులని ఆదేశించారు. కాగా సత్యనారాయణకు చిత్తారమ్మ బస్తీ, బాలానగర్‌లో తెలంగాణ ప్రభుత్వం 2బీహెచ్‌కే హౌసింగ్‌ స్కీమ్‌ కింద ఇల్లు కేటాయించి, పింఛను కూడా మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల పత్రాలను అధికారులు అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *