mt_logo

హైదరాబాద్ లో 250 స్వచ్ఛ ఆటోలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

స్వచ్ఛ హైదరాబాద్‌ లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ కొత్తగా సమకూర్చిన 250 స్వచ్ఛ ఆటోలను సనత్‌నగర్‌లోని జీహెచ్‌ఎంసీ వెల్ఫేర్‌ గ్రౌండ్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ ఆటోలు ప్రతి రోజు 400 నుండి 500 ఇళ్ల నుండి తడి, పొడి చెత్తను సేకరిస్తాయని తెలియజేసారు. నగరవాసులు స్వచ్ఛ ఆటోలను ఉపయోగించుకోవాలని, చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దని విజ్ఞప్తి చేశారు. స్వచ్చతలో ఇప్పటికే అనేక అవార్డులు అందుకున్న హైదరాబాద్‌ను, ఇక గ్రీన్‌సిటీగా మార్చడానికి అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్‌ అలీ, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *