mt_logo

అవార్డులు వస్తున్నా… ఏమీ చేయలేదనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది : విపక్షాలపై ఫైర్ అయిన మంత్రి కేటీఆర్

విపక్షాల పొంతన లేని మాటలు ఆశ్ఛర్యం కలిగిస్తున్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో తెలంగాణ టాప్‌లో ఉంటుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకింగ్స్‌లో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది. స్వచ్ఛ ర్యాంకుల్లో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు 16 అవార్డులు గెలుచుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ర్యాంకుల్లో తెలంగాణ అగ్రభాగంలో ఉంది. అయినా తెలంగాణలోని విపక్షాలు.. రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదంటున్నాయి. విపక్షాల పొంతన లేని మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి’ అని మంత్రి కేటీఆర్‌ పోస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *