mt_logo

తెలంగాణలో తొలి ఈ-బైక్ రూపొందించిన విద్యార్థుల బృందాన్ని అభినందించిన మంత్రి కేటీఆర్

తెలంగాణలో రూపొందించిన తొలి ఈ-బైక్… గ్రావ్టన్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్ కంపెనీ విద్యార్థుల బృందానికి ఐటీ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. హైదరాబాద్ కు చెందిన గ్రావ్టన్ మోటార్స్ తొలి ఈ-బైక్ ను రీసెంట్ గా విడుదల చేయగా… ఈ బృందంలో సిరిసిల్లకు చెందిన యువకులు కూడా ఉన్నారని తెలిసిన కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతూ… మా ప్రాంతం పిల్లలున్నందుకు గర్వంగా ఉంది అంటూ కామెంట్ చేశారు. ఈ బైక్ మీద కన్యాకుమారి నుంచి లడఖ్ లోని ఖర్దూంగ్ వరకు నాన్ స్టాప్ గా రైడ్ చేసి మరో రికార్డు కూడా సృష్టించింది దీన్ని తయారు చేసిన బృందం. క్వాంటా పేరుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ ఎలక్ట్రిక్ బైక్ కేవలం 80 రూపాయల ఖర్చుతో 800 కిలోమీటర్ల మైలేజి ఇస్తుందని, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 నుండి 320 కిలోమీటర్ల ప్రయాణం సాగుతుందని కంపెనీ తెలిపింది. తెలంగాణ సర్కార్ గో ఎలక్ట్రిక్‌ ప్లాట్‌ఫామ్‌లో ఎలక్ట్రిక్ బైక్ ‘క్వాంటా’ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్‌ ఆవిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *