రాష్ట్రంలో మూడు అత్యున్నత పదవుల్లో రైతు బిడ్డలు ఉండడం ఆనందాన్ని కలిగిస్తోందన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. శాసనమండలి చైర్మన్గా రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డికి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిల్లో కేటీఆర్ మాట్లాడుతూ… రాష్ట్రానికి గర్వకారణం ఏందంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి… వీరంతా రైతు బిడ్డలే కావడం విశేషం. రైతు బిడ్డలు అత్యున్నతమైన రాజ్యాంగ పదవుల్లో ఉండటం ఈ రాష్ట్ర అదృష్టం. గుత్తా సుఖేందర్ రెడ్డిని ఉద్దేశించి… మీరు వార్డు మెంబర్ నుంచి మండలి చైర్మన్ వరకు ఎదిగారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు. 1996లో కేసీఆర్, అప్పటి తెలుగు దేశం ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. మీరు, కేసీఆర్ కలిసి.. అప్పటి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు చూసేందుకు మీరంతా వెళ్లారు. మీరు బాధతో ఇక్కడ ప్రాజెక్టు ఎట్ల ఉన్నదని అడిగి బాధపడ్డారు. ఏదో ఒక సమయం వస్తది.. తెలంగాణ ఏర్పడితే తప్ప మన రైతుల బాధలు తీరవు అని కేసీఆర్ చెప్పారు. ఆనాటి నుంచే కేసీఆర్తో మీరు అనేక సందర్భాల్లో పలు అభిప్రాయాలను పంచుకున్నారు. 2008లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేశారు. ఆలేరు నియోజకవర్గంలో పని చేయాలని కేసీఆర్ నాకు ఆదేశం ఇవ్వడంతో అక్కడికి వెళ్లాను. సుఖేందర్ రెడ్డి గట్టి తెలంగాణవాది ఆయన ఆశీస్సులు కూడా తీసుకోవాలని కొందరు నేతలు నాకు సూచించారు. తాము కోరినట్లే తెలంగాణవాదులు గెలవాలని ఆలేరు అభ్యర్థి నగేశ్కు సుఖేందర్ రెడ్డి నైతిక మద్దతు ఇచ్చి స్థైర్యాన్ని నింపారు. నల్లగొండ జిల్లాలోని ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారం కొరకు మునుగోడు నియోజకవర్గానికి స్పీకర్ నాదేండ్ల మనోహర్ నాడు తీసుకెళ్లారు. పార్లమెంట్ సభ్యుడిగా మీరు చెప్పిన మాట ఏంటంటే.. ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం పోవాలంటే కృష్ణా జలాలను సురక్షితంగా ఇంటింటికీ అందించినప్పుడే పోతుందని చెప్పారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ పథకంతో ఫ్లోరోసిస్ నుంచి విముక్తి పొందాం. మొట్టమొదటి రైతు సమన్వయ సమితి చైర్మన్గా మీరు బాధ్యతలు స్వీకరించి సమర్థవంతంగా నిర్వహించారని గుత్తా సుఖేందర్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ పేర్కొన్నారు.
- Stunning clicks of rich wildlife in HCU
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్