భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మంగళవారం అర్ధరాత్రి జిల్లా కలెక్టర్ అనుదీప్ భార్య మాధవి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ట్విట్టర్ వేదికగా కలెక్టర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపుతూ…సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులు అధునాతన సౌకర్యాలతో మెరుగైన సేవలు అందిస్తున్నాయని, దీంతో రాష్ట్రంలోని ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే వైద్యం చేయించుకునేందుకు ఉత్సాంగా ముందుకొస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. అందుకు నిదర్శనం కలెక్టర్ దంపతులేనని మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. అలాగే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా కలెక్టర్ దంపతులకు గ్రీటింగ్స్ తెలిపారు.

