mt_logo

మరోసారి సిద్దిపేటను వరించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు

ఇప్పటికే పదుల సంఖ్యలో స్వచ్ఛత అవార్డులను అందుకున్న సిద్దిపేట నగరం మరోసారి జాతీయ స్థాయిలో మెరిసిపోయింది. జాతీయస్థాయిలో స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ 2021 అవార్డుకు సిద్దిపేట ప‌ట్ట‌ణం మళ్ళీ ఎంపికైంది. తడి, పొడి, హానికరమైన చెత్త సేకరణలో వాహనాల నిర్వహణ , వీటి ప్రక్రియ‌, పారిశుద్ధ్య కార్మికుల పనితీరు, సర్టిఫికేషన్ విధానం, ప్రజల భాగస్వామ్యం, చైతన్యం, స్వచ్ యాప్ ఉపయోగించడం వంటి కార్య‌క్ర‌మాల‌ను సంపూర్ణంగా అమ‌లు చేయ‌డంతో సిద్ధిపేటను ఈ అవార్డు వ‌రించింది. ఈ సంద‌ర్భంగా సిద్దిపేట ప్ర‌జ‌ల‌కు మంత్రి హ‌రీశ్ రావు శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతోనే ఈ విజ‌యం సాధ్య‌మైంద‌ని హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 20వ తేదీన ఢిల్లీలో రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సిద్దిపేట మున్సిప‌ల్ చైర్మ‌న్ మంజుల రాజనర్సు, క‌మిష‌న‌ర్ ర‌మ‌ణాచారి ఈ అవార్డును అందుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *