mt_logo

100 కోట్లతో రంగనాయక సాగర్ పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి : మంత్రి హరీష్ రావు

సిద్ధిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ ను 100 కోట్లతో గొప్ప పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దనున్నట్టు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. శుక్రవారం సిద్ధిపేట శివారులోని నాగులబండ దగ్గర 20 కోట్లతో నిర్మించిన హరిత త్రీ స్టార్ హోటల్ ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు… తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రoగా ఏర్పడడం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించడంతో సిద్దిపేట దశ, దిశ మారిందన్నారు. ఉత్తర తెలంగాణ నుంచి రాక పొకలు సాగించే వారికి ఉప యోగ పడేలా రెస్టారెంట్ ఉపయోగ పడుతుంది. టూరిజం హోటల్ ప్రక్కనే వందలాది మందికి ఉపాధి నిచ్చే ఐటీ టవర్ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. టూరిజం హోటల్ ముందు ఆక్సిజన్ పార్క్ 200 ఎకరాలలో విస్తరించి ఉంది. విద్య, వైద్యం రంగాలలో మౌలిక సదుపాయాలు పెంపొందిస్తున్నామని తెలియజేశారు. ఇప్పటికే సిద్దిపేట జిల్లా 33 జాతీయ, పలు రాష్ట్ర స్థాయి అవార్డులను సొంతం చేసుకున్నామని గుర్తు చేశారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని దుద్దేడను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *