mt_logo

సిద్దిపేటలో ఫ్రీడమ్ పార్కును ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తోందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట శివారు రంగనాయక సాగర్ లో ఫ్రీడమ్ పార్కు ను జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డిలతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో చాలా చోట్ల జాతీయ జెండాలు కేంద్రం సరఫరా చేయలేక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాగితాలు అంటించుకోవాలని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. జాతీయ జెండాకు మీరిచ్చే విలువ ఇదేనా అంటూ.. కేంద్రం తీరును మంత్రి హరీష్ రావు విమర్శించారు. మేకిన్ తెలంగాణ పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి 20 లక్షల జెండాలు తయారు చేసి ఇంటింటికీ ఇవ్వడమే కాకుండా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించామని తెలిపారు. గాంధీ బాటలో నడిచి మన దేశం స్వాతంత్ర ఫలాలు పొందిందని, కానీ ఇపుడు గాంధీజీని అవమాన పరిచి గాడ్సేను పొగిడే సంస్థలు పుట్టుకొచ్చాయని, వాటిని తరిమికొట్టాలని, అలాంటి సంస్థల నుంచి దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అలాంటి సంస్థల పై చర్యలు తోసుకోవడం లేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భావి భారత పౌరులకు సినిమా టాకీసులలో దేశభక్తిని పెంపొందించేలా దేశభక్తి చాటేలా స్వాతంత్ర సమరయోధుల చిత్రాలను ప్రదర్శించి చూపుతున్నట్లు తెలిపారు. స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో ప్రతీ పౌరుడు స్వచ్ఛందంగా పాల్గొనాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *